‘ చిత్ర సీమ ’  సెప్టెంబర్  1957,  నుంచి

 సావిత్రికి  మామూలు సమయాల్లోమేకప్చేసుకోవటమంటే మహామంట.సింపుల్ గా ఉంటేనే బాగుంటుందని ఆమె అభిప్రాయం. సావిత్రి అంటే నిర్మాతలకు చాలా సదభిప్రాయం ఉంది. సెట్స్ లోకి వెళ్లిందంటే , ఏ మూడ్లోకి వెళ్లాలన్నా, డైరక్టర్ చెప్పిన మరుక్షణంలో ఆ మూడ్లో ప్రవేశించగలదు.అంతేగాని, యివ్వాళ మూడ్లో లేనండి అనే ఆర్టిస్ట్ కాదు సావిత్రి.  వేంప్ రోల్స్అన్నా , వేంప్ గా వుండటమన్నా ఆమెకు సుతారామూ యిష్టం లేదు.

సౌందర్యార్చన కోసంటాయిలెట్స్ ,క్రీములువాడటం యిష్టం లేదంటుందిసావిత్రి.మేకప్ దేనితో చేసుకుంటారు మీర?

అని చాలా మంది ప్రశ్నిస్తారు.దేనితోనూ చేసుకోను ,అంటుందామె.చిరునగవుకు మించిన సౌందర్య భూషణం మరేదీ లేదని ఆమె అభిప్రాయం.తన అభిమానులు వ్రాసే ఉత్తరాలన్నీ చదువుతుంది గాని,తీరిక చిక్కనందున అందరికి వ్రాయటం కుదరటం లేదని ఆమె చింతిస్తుంది.